'విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట'

'విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట'

NRML: దిలావర్‌పూర్ మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని తక్షణ పరిష్కారం అందించడమే లక్ష్యమని ఏఈ శంకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న విద్యుత్ తీగలు, వంగిన స్తంభాలను మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. సమస్యలు ఉంటే నేరుగా అధికారులకు తెలియజేయాలని సూచించారు.