వంతెనపై ప్రతి క్షణం భయమే..!

వంతెనపై ప్రతి క్షణం భయమే..!

PPM: మామిడిపల్లి శంబర రహదారిలో ముచ్చెర్ల వలస కూడలి వద్ద ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వెంగళరాయసాగర్ నిర్మాణ సమయంలో కాలువపై నిర్మించిన ఈ వంతెన ఏళ్లుగా మరమ్మతులు లేక నిర్లక్ష్యానికి గురైంది. ఇరువైపులా రైలింగ్లు దెబ్బతిని ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి. అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.