రైతు ఉత్సవాలకు బయలుదేరిన రైతులు

రైతు ఉత్సవాలకు బయలుదేరిన రైతులు

కామారెడ్డి: బిక్కనూర్ రైతులు ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరుగుతున్న రైతు ఉత్సవాలకు తరలివెళ్లారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో రైతులు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని, ప్రదర్శన స్టాళ్లను రైతులు పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు హాజరవుతారని ఏఓ తెలిపారు.