VIDEO: 'వాళ్ల మాదిరి నేను కూడా ఆక్రమణలను ప్రోత్సహించాలా?'
HYD: పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎంఐఎంకు భయపడుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హైదరాబాద్లోని ప్రతి ఫుట్ పాత్ను ఎంఐఎం నేతలు కబ్జా చేయించారని, ఫుట్ పాత్పై షాపులు పెట్టించి కిరాయి వసూలు చేస్తున్నారని అన్నారు. ఇదే తమాషా గోషామహల్ నియోజకవర్గంలో సైతం జరుగుతోందని, ఎంఐఎం నేతల మాదిరి నేను కూడా ఆక్రమణలను ప్రోత్సహించాలా అని ప్రశ్నించారు.