పత్తి కొనుగోలు నిబంధనలు సడలించాలి: సీపీఎం
KRNL: పత్తి కొనుగోళ్లకు సంబంధించిన CCI నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద CPM ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా CPM కార్యదర్శి తిక్కన్న మాట్లాడుతూ.. రైతులు పండించిన పత్తిని నిబంధనలకు అతీతంగా కొనుగోలు చేయాలన్నారు. ఉల్లి పంటకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలన్నారు.