శ్రీశైల క్షేత్రంలో మహాకుంభోత్సవం

శ్రీశైల క్షేత్రంలో మహాకుంభోత్సవం

AP: శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంభికా అమ్మవారి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం అమ్మవారికి తొలి విడత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మకాయలు, గుమ్మడికాయలను సమర్పిస్తారు. సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం చేస్తారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత అన్నాన్ని కుంభరాశిగా పోసి ఆలయ ఉద్యోగి గోవింద్ స్త్రీవేషంలో అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.