పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణబాబు
విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 59వ, 60వ వార్డుల్లో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. పేదల సేవే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. పెన్షనర్ల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.