‘లిక్కర్’ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను JAN 21కి వాయిదా వేసింది. మద్యం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ను హైకోర్టు రద్దు చేయడంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.