వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
NGKL: ఎస్పీ వైభవ్ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి కల్వకుర్తి పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. సరైన పత్రాలు లేకపోయినా, మద్యం తాగి డ్రైవింగ్ చేసినా, అతి వేగానికి పాల్పడినా వాహనాలను సీజ్ చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.