విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయ వివరాలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయ వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,69,572 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 230 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 66 మంది శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 1800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.