మెస్సీతో రాహుల్ భేటీ.. ఫలక్నుమాలో సందడి!
TG: హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో భేటీ అయ్యారు. వీరిద్దరూ అక్కడ కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. వీరిద్దరి భేటీ రాజకీయ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా, నిన్న ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో సీఎం రేవంత్ మ్యాచ్ను వీక్షించేందుకు రాహుల్ హైదరాబాద్ వచ్చారు.