ట్రంప్‌ - మోదీ.. మధ్యలో మస్క్?

ట్రంప్‌ - మోదీ.. మధ్యలో మస్క్?

పశ్చిమాసియా పరిస్థితులపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ కాల్‌ మధ్యలో ఎలాన్‌ మస్క్‌ జాయిన్‌ అయినట్లు 'న్యూయార్క్‌ టైమ్స్‌' తెలిపింది. యుద్ధ సంక్షోభంలో ఇద్దరు దేశాధినేతల మధ్య సంభాషణలో మస్క్ పాల్గొనడం అసాధారణమని పేర్కొంది. అయితే, దీనిపై ఇరుదేశాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.