'ఇళ్ల మధ్యలో డంపు చేసిన చెత్తను తరలించాలి'
ATP: గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ ఏరియాలో సోమవారం చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. కాలనీవాసులు కాళీ ప్రదేశంలో చెత్తను డంపు చేశారని కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే కమీషనర్ చెత్తను తరలించాలని సిబ్బందికి ఆదేశించారు. డ్రైనేజీ కాలువలపై సేఫ్టీ గా బండలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్కు సూచించారు.