కనిగిరిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో ఎస్సై కే మాధవరావు ఆదివారం తెల్లవారుజామున విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... వాహనాల్లో గంజాయి వంటి మత్తుపదార్థాలను, మారణాయుధాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు.