రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

తిరుపతి కేటీ రోడ్డు రామకృష్ణ మిషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీ.రోహిత్ కుమార్ మృతి చెందారు. ముందు కారును తప్పించేందుకు వేగంగా వచ్చిన కియా కారెన్స్ (AP39WN8467) అతడి వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోహిత్ మరణించారు. తండ్రి జీ.వెంకటేష్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.