ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు ఎస్పీ
జగిత్యాల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు జరుగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కొడిమ్యాల బార్డర్లో దొంగలమర్రి చెక్ పోస్టను ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నగదు, మద్యం ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆధారాలు లేకుండా భారీ మొత్తం నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని ఎస్పీ సూచించారు.