VIDEO: ఏపీ నిరుద్యోగ జేఏసీ ర్యాలీ

VSP: ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత ర్యాలీని గురువారం విశాఖలో నిర్వహించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలకు, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ముఖ్యమంత్రికి, నారా లోకేష్లకు జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది.