విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే?

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తులు స్వామివారికి చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,63,403 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 304 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 27 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. అలాగే, 2400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.