ఘనంగా ‘హెరిటేజ్ వాక్’
ATP: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఇవాళ కుందుర్పిలో ‘హెరిటేజ్ వాక్’ కార్యక్రమాన్ని పురావస్తు శాఖ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు బల్లేపల్లి మఠం నుంచి కుందుర్పమ్మ కోట వరకు ఈ యాత్ర సాగింది. పురాతన కట్టడాలు, శిలాశాసనాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధికారులు అన్నారు.