నగరంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు
HYD: హోలీ వేడుకల నేపథ్యంలో నగరంలోని దూల్పేట్, నాంపల్లి ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2.622 కేజీల గంజాయితో తయారు చేసిన బంగ్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలను సీజ్ చేసి దూల్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.