ఈవ్ టీజింగ్పై పోలీసులు ఉక్కుపాదం..!
KDP: మైదుకూరు పట్టణంలో మహిళలు, పిల్లల భద్రతను మెరుగుపరిచేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం అర్బన్ సీఐ కె. రమణారెడ్డి నేతృత్వంలో, అన్ని పాఠశాలలు, కళాశాలల వద్ద 'విజిబుల్ పోలీసింగ్' నిర్వహించి, ఈవ్ టీజింగ్ను అరికట్టారు. విద్యార్థినులకు పూర్తి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని సీఐ స్పష్టం చేశారు.