ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర
ASR: అనంతగిరి మండలం, చిలకలగడ్డ పరిధిలో ఆదివాసీ JAC ఛైర్మన్ రామారావు దొర ఆదివాసీ సత్యాగ్రహ యాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రామారావు దొర మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల చట్టం చేయాలన్నారు. ఏజెన్సీలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టులన్నీ రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. 1/70, FRA, PESA చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు.