పాక్లో పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ర్యాలీ

పహల్గామ్ ఉగ్రదాడిలో మాస్టర్మైండ్గా వ్యవహరించిన లష్కరే కమాండర్ సైఫుల్లా కసురి పాక్లో ప్రత్యక్షమయ్యాడు. దాయాది దేశంలో భారత్కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు, ప్రసంగాలు చేశాడు. వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయిద్ కుమారుడు తల్హా సయిద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.