రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

KNR: హుజూరాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిలోని బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్, డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో డీసీఎం వ్యాన్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బైపాస్ రోడ్డు కూడలి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, సూచికలు లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.