ఇందారంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

ఇందారంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

MNCL: జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మొదటి వార్డులో ఈజీఎస్ నిధులతో మంజూరైన సీసీ రోడ్ల పనులను సోమవారం గ్రామ సర్పంచ్ ఫయాజుద్దీన్ ప్రారంభించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ప్రోత్సాహంతో గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు.