పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుంది: ఎమ్మెల్యే

పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుంది: ఎమ్మెల్యే

PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మంగళవారం సుల్తానాబాద్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన అనంత పద్మనాభ ఏజెన్సీ, అంబేద్కర్ చౌక్ దగ్గర నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ పుస్తక ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ ఛైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మినూపాల ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.