ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు
NRML: భద్రాద్రి ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ను బుధవారం ఏర్పాటు చేశారు. రూ.151 చెల్లించి ఈ నెల 31లోపు నమోదు చేసుకుంటే, కల్యాణం అనంతరం తలంబ్రాలు ఇంటికి అందజేస్తామని డిపో మేనేజర్ కే. పండరి తెలిపారు.