కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

ములుగు: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏటూరునాగారం మండలం రోహిరు గ్రామంలో జరిగింది. మోతే మహేష్ (22) అనే యువకుడు ఇంట్లో గొడవల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.