PGRS వేదికకు 92 ఫిర్యాదులు: సీపీ
VSP: నగర పోలీస్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు సోమవారం 92 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ డా. శంఖబ్రత భాగ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించి, ఫిర్యాదుదారులతో మాట్లాడారు. కుటుంబ, భూ వివాదాలు, మోసం, సివిల్ కేసులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.