జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గియడమే లక్ష్యం: ఎస్పీ
NLR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల సోమవారం తెలిపారు. బస్సుల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ను పరిశీలిస్తున్నామని, హైవేలపై బ్లాక్ స్పాట్స్ను ఇప్పటికే సరిదిద్దామని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాల మరణాల రేటు 20% తగ్గిందని ఆమె పేర్కొన్నారు.