రూ. 30 లక్షలతో ఆలయ పునర్నిర్మాణం
SRPT: అనంతగిరి మండలం పాలవరంలోని పురాతన బాల ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎన్ఆర్ఎ రవి సుమారు రూ. 30 లక్షల ఆర్థిక సాయం అందించారు. బుధవారం సర్పంచ్ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ స్లాబ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మికతకు రవి అందిస్తున్న సహకారం అభినందనీయమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.