పోలీసులు విస్తృత స్థాయి తనిఖీలు
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. సిఐ సుభాస్, ఎస్ఐ జబ్బర్ ఆధ్వర్యంలో బస్టాండ్ , జన సమూహాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్ను ఉపయోగించి బస్ స్టాండ్లోని ప్రయాణికుల లగేజీలు, పార్శిల్ ప్రాంతాలు, మరియు అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించారు.