ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన పరిశీలకులు
SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాలను జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో, వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీవో సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.