మండల అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే గిడ్డి

మండల అభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. అయినవిల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ మట్టపర్తి నాగ విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించారు.