క్రీడా పోటీల్లో కొత్తచెరువు జట్టు విన్నర్
SS: కొత్తచెరువు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం జరిగిన డివిజన్ స్థాయి ఆటల పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్-17 బాలుర కోకో విభాగంలో కొత్తచెరువు జట్టు విన్నర్గా నిలవగా, ఓడీసీ రన్నరప్గా నిలిచింది. కబడ్డీలో బుక్కపట్నం జట్టు విజేతగా, ఓడీసీ రన్నరప్గా నిలిచింది.