మల్లవల్లికి రానున్న మరో మణిహారం.. MOU ఖరారు
ఎన్టీఆర్: లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు హిందుజా గ్రూప్తో పలు MOUలు ఖరారు చేసుకున్నారు. సోమవారం ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించిన ఆయన బాపులపాడు మండలం మల్లవల్లిలో ఈవీ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, లైట్ వెయిట్ వాహనాల తయారీ ప్లాంట్ నిర్మించేందుకు MOU చేసుకున్నారు. చర్చల అనంతరం సంస్థ ఛైర్మన్ అశోక్, పి.హిందుజా తదితరులు సీఎంకు MOU ప్రతులను అందజేశారు.