అడ్డుగా ఉన్న దుకాణాలు తీసివేయాలి: MRO
E.G: గోకవరం మండలానికి ప్రధాన సమస్యగా ఏర్పడిన బ్రిటిష్ కాలంనాటి ఇరుకు వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రోడ్డు ఇరువైపుల అడ్డుగా ఉన్న దుకాణాలను తీసివేయాలని తహసీల్దార్ రామకృష్ణ యజమానులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పవన్ కుమార్, వీఆర్వో వెంకటరమణ, సర్వేర్ వెంకట శివ, తదితరులు పాల్గొన్నారు.