వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NRPT: ఉట్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరి ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.2,300 చెల్లించి కొనుగోలు చేస్తుందని అన్నారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బొనస్ ఇస్తుందని చెప్పారు.