విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.05 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.05 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారికి చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,05,733 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 78 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 4 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1200 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.