'అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయండి'
ELR: నూజివీడు కోర్టులో డిసెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 15వ అదనపు జిల్లా జడ్జి ఏ నాగ శైలజ శుక్రవారం బార్ అసోసియేషన్ మెంబర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రమేష్, కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు.