'త్రీ రోజెస్' సీజన్ 2 వచ్చేస్తోంది
కుషిత కల్లపు, ఈషా రెబ్బా, రాశీ సింగ్ వంటి నటీమణులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'త్రీ రోజెస్' సీజన్-2 . ఈ సిరీస్ డిసెంబర్ 12 నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సీజన్-1 కంటే సీజన్-2 మరింత వినోదభరితంగా ఉంటుందని నిర్మాత ఎస్కేఎన్ చెప్పాడు. కాగా, ఈ సిరీస్కు కిరణ్ కె.కరవల్ల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.