వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన సినీనటి
MHBD: కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి వారి ఆలయాన్ని సినీనటి రాగిణి సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన సినీనటికీ స్థానికులు ఘన స్వాగతం పలికారు. వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.