తిరుమలలో భక్తుల రద్దీ

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,066 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 24,020 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు.