అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం

అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం

KMM: ఖమ్మం వెలుగుమట్లలోని పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చిన ఘటనలో నిరాశ్రయులైన పేదలకు న్యాయం చేయాలని సీపీఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్ బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.