తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 12 గంటల సమయం పడుతోంది. 21 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,239 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,436 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.