నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి.!
ప్రకాశం: పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 ఇదే రోజున కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లెలో జన్మించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైనాడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రధాన కారణభూతుడైన వ్యక్తి. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేశాడు. ఆయన త్యాగం చిరస్మరణీయం.