గుడ్లవల్లేరులో శుభ్రతా చర్యలు

గుడ్లవల్లేరులో శుభ్రతా చర్యలు

కృష్ణా: గుడ్లవల్లేరులో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం అధికారులు శుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. ఇందిరానగర్, ఎన్టీఆర్‌నగర్, నెహ్రూనగర్ ప్రాంతాల్లో లైమ్ పౌడర్ వేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వ్యాధి నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తూ, కాలువలు, డ్రైనేజీలు, రోడ్డు పక్క ప్రాంతాలను శుభ్రపరిచారు.