మున్సిపల్ పాలకవర్గం పారిశుద్ధ్య కార్మికుల ర్యాలీ
SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రతిజ్ఞ చేయించారు. 10 వారాల పాటు 10 అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వార్డుల్లోని సమస్యలను కౌన్సిలర్లు, ప్రజల సహకారంతో పరిష్కరించనున్నట్లు చెప్పారు.