ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన సర్పంచ్
సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామంలో ఐకేపీ సెంటర్ను ఇవాళ గ్రామ సర్పంచ్ చిన్నమ్మనేని మౌనిక - కిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్, పోరాం అధ్యక్షులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.