'అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి'

'అంబేద్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి'

MNCL: దండేపల్లిలో నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు అందరూ విజయవంతం చేయాలని అంబేద్కర్ సంఘం మండల నాయకులు లింగంపల్లి బాపు తదితరులు కోరారు. శనివారం దండేపల్లి ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్. అంబేద్కర్ అందరివాడని అన్నారు. ఏప్రిల్ 14న దండేపల్లి మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.